16 ఏళ్ల బాలికను 3 వేలకు అమ్మిన తండ్రి

రాయ్పూర్ : ఇది ఘోరం.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. తన కూతురును అమ్మేశాడు. అది కూడా అక్షరాల మూడు వేల రూపాయాలకు. ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటు చేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది.
ఛత్తీస్గఢ్లోని రాయ్ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను రెండేళ్ల క్రితం 21 ఏళ్ల యువకుడికి రూ. 3 వేలకు అమ్మేశాడు. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇంట్లో పని చేయించుకునేందుకని చెప్పి ఆ బాలికను యువకుడు తీసుకెళ్లాడు. కానీ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి హింసించాడు. ఈ క్రమంలో బాధితురాలు కొన్ని నెలల క్రితం గర్భం ధరించింది. దీంతో ఆ యువకుడు.. ఆమెను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆమెతో డబ్బు లేకపోవడంతో వీధుల్లో తిరుగుతూ జీవనం సాగించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆమెను ఎవరూ ఆదుకోలేదు. మొత్తానికి ఈ ఏడాది మే నెలలో బాధితురాలిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నెల రోజుల క్రితం ఆమెను బిలాస్పూర్లోని సఖి కేంద్రానికి తరలించారు.
తనకు జరిగిన ఘోర అవమానాన్ని సఖి కేంద్ర నిర్వాహకులకు బాధితురాలు చెప్పింది. రెండేళ్ల క్రితం తన అమ్మ చనిపోయినప్పుడు.. తనను ఓ యువకుడికి రూ. 3 వేలకు నాన్న అమ్మాడు. తాను కేవలం ఇంటి పని చేయిస్తానని చెప్పి తనను ఆ యువకుడు తీసుకెళ్లాడు. కానీ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. చివరకు గర్భం వచ్చాక రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు అని చెబుతూ బాధితురాలి కన్నీరు పెట్టుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్కు.. లేదంటే గెహ్లాట్కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు