అహ్మదాబాద్ : రూ 500 ఇవ్వలేదని స్నేహితుడిపై కోపం పెంచుకున్న వ్యక్తి కత్తితో ఫ్రెండ్పై దాడికి దిగిన ఘటన నగరంలోని జుహపుర ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడు మొహిసిన్ అన్సారీ తన ఫ్రెండ్ అఖిల్ మలేక్ను ఆదివారం రూ 500 ఇవ్వాలని కోరగా మలేక్ తన వద్ద డబ్బులేదని, తల్లి చికిత్స కోసం ఖర్చు చేశానని చెప్పాడు.
దీంతో మలేక్పై కోపం పెంచుకున్న అన్సారీ టీస్టాల్ వద్ద కనిపించిన మలేక్తో వాగ్వాదానికి దిగాడు. అన్సారీ తీరును తప్పుపట్టిన బాధితుడిపై నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. మలేక్ ముఖానికి తీవ్రగాయాలు కాగా స్ధానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు.