ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీసుకున్న రూ 1.5 లక్షలను తిరిగి ఇవ్వాలని కోరడంతో పాటు లైంగిక దాడి కేసు పెడతాననడంతో ప్రియురాలిపై ఆగ్రహంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుషిత పుంజర్ గత కొంత కాలంగా తనను పెండ్లి చేసుకోవాలని ప్రియుడు బిపిన్ ను కోరుతోంది.
గత కొంత కాలంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇదే క్రమంలో తన వద్ద తీసుకున్న రూ 1.5 లక్షల నగదును తిరిగి ఇవ్వాలని బిపిన్ ను ఆదివారం రాత్రి కుషిత కోరగా అందుకు నిరాకరించాడు. ఆపై ఆగ్రహంతో ఊగిపోయిన బిపిన్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. స్ధానికుల సహకారంతో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.