నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకులు కర్రలతో కొట్టి చంపారు. బాబాయి, పిన్ని, మరో బంధువు ముగ్గురు కలిసి హత్య చేశారు. మృతుడు శ్రీకాంత్ మాడ్గుల మండలం సుద్దపల్లివాసి.