న్యూఢిల్లీ: భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఇవాళ రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం సుమారు 4960 మిలాన్-2టీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను భారత ఆర్మీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందిస్తుంది. సుమారు 1188 కోట్లతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. మిలాన్-2టీ క్షిపణులను.. బీడీఎల్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్రాన్స్కు చెందిన రక్షణ కంపెనీ ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ఆ ఉత్పత్తి జరుగుతుందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్కు ఇదో పెద్ద బూస్టప్ కానున్నది. బీడీఎల్తో కాంట్రాక్ట్ ఆర్డర్ను రిపీట్ చేసినట్లు తెలుస్తోంది. 2016, మార్చి 8వ తేదీన కూడా ఆర్మీ, బీడీఎల్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అయితే మూడేళ్లలో మొత్తం ఆయుధాలు ఆర్మీ బాండాగారంలోకి వస్తాయి. మిలాన్ మిస్సైల్ను 70వ దశకంలో తొలిసారి ఉత్పత్తి చేశారు. మిలాన్-2టీ .. రీసెంట్ వర్షెన్. 90వ దశకంలో దీన్ని కౌంటర్ వెపన్గా డెవలప్ చేశారు. మిలాన్-2టీని టాండెమ్ వార్హెడ్ ఏటీజీఎం ఆయుధంగా పరిగణిస్తారు. దీన్ని రేంజ్ 1850 మీటర్లు. ఫ్రాన్స్కు చెందిన ఎంబీడీఏ మిస్సైల్ సిస్టమ్స్ దగ్గర బీడీఎల్ లైసెన్స్ తీసుకున్నది. గ్రౌండ్ నుంచి లేదా.. వాహనాల నుంచి .. లాంచర్ల ద్వారా ఈ మిస్సైల్ను ప్రయోగించవచ్చు. యాంటీ ట్యాంకర్ పాత్రలో కూడా దీన్ని వాడే అవకాశం ఉన్నది.