జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జాడి ప్రవీణ్(35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రవీణ్ కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి ప్రవీణ్ ఇంటి బయట నిద్రించాడు. అతన్ని సమీపంలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి గొడ్డలితో నరికి చంపారు. ప్రవీణ్ ను గమనించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.