బిజ్నోర్ : యూపీలో మహిళలు, బాలికలే కాదు మహిళా పోలీసులపైనా అసాంఘిక శక్తులు ప్రతాపం చూపుతున్నారు. మాస్క్ ధరించలేదని వ్యక్తిని ఆపినందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నిందితుడు వేధించిన ఘటన అమ్రోహ జిల్లాలో వెలుగుచూసింది. తనను అడ్డగించారనే కోపంతో ఓ మహిళా కానిస్టేబుల్ యూనిఫాంను నిందితుడు చించివేశాడు. జిల్లాలోని ఓ రద్దీ మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకతాయిల పనిపట్టే యాంటీ రోమియో స్క్వాడ్లో ఈ మహిళా పోలీసులు పనిచేస్తున్నారు.
తన పదేండ్ల కుమారుడితో మాస్క్ లేకుండా బైక్పై వెళుతున్ననిందితుడిని మహ్మద్ జైద్గా గుర్తించారు.మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు మహిళా పోలీసులపై నిందితుడు అనుచితంగా వ్యవహరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు బైక్ పై కూర్చున్నపదేండ్ల కుమారుడికి కూడా మాస్క్ లేదని పోలీసులు తెలిపారు.