ముంబై: భార్యతో గొడవ పడిన ఒక వ్యక్తి ఐస్క్రీమ్లో ఎలుకలను చంపే మందు కలిపి తన ముగ్గురు పిల్లలకు ఇచ్చాడు. అది తిన్న ఐదేండ్ల బాలుడు మరణించగా మరో ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని మన్ఖుర్డ్ శివారులో ఈ ఘటన జరిగింది. మహ్మద్ అలీ నౌషద్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన భార్యతొ గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో తన ముగ్గురు పిల్లలను చంపాలనుకుని ఐఎస్క్రీమ్లో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. అది తిన్న ఐఏండ్ల అలీషాన్ అలీ మొహమ్మద్ విషప్రయోగం వల్ల మరణించగా, మరో ఇద్దరు పిల్లలు ఏడేండ్ల అలీనా, రెండేండ్ల అర్మాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భర్త మహ్మద్ అలీ నౌషద్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.