కేంద్రప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆక్సిజన్ తదితర అవసరాల కోసం ప్రజలు ఇంటర్నెట్లో, సోషల్మీడియాలో చేస్తున్న అభ్యర్థనలను తప్పుడు సమాచారంగా చిత్రీకరిస్తూ అధికారులు వారి నోరు మాయించటాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ఇదొక జాతీయ సంక్షోభం. ఇంటర్నెట్లో లేవనెత్తే ఏ ఫిర్యాదైనా తప్పుడు సమాచారమేననే అభిప్రాయం సరైనది కాదు. ఈ రకమైన అణిచివేత చర్యలు ఇకపై కూడదు’ అని ధర్మాసనం హెచ్చరించింది. పేదలు ప్రైవేటు దవాఖానల్లో డబ్బులు చెల్లించి టీకాలు వేసుకోలేరని, కాబట్టి ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది.