గుమ్మడిదల, మార్చి13 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గుమ్మడిదల-బొంతపల్లి శివారులోని జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా వెంకట్రావ్పేటకు చెందిన బ్యరంగుల రాజు తన మిత్రలతో కలిసి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుమ్మడిదల టోల్ ప్లాజా నుంచి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు వెళ్తున్న బైక్ రాజును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.