చాదర్ఘాట్ : గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి (50) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్పేట కాలాడేరా ప్రాంతానికి చెందిన మహ్మద్ షబ్బీర్ (50) పని మీద మంగళవారం రాత్రి యశోద దవాఖాన వద్ద రోడ్డు దాటుతుండుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
చికిత్స కోసం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసుల పేర్కొన్నారు. ఈ మేరకు చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.