రంగారెడ్డి : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ సర్వీసురోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఆదిబట్ల ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని బొంగుళూరు గ్రామానికి చెందిన ఆగయ్య(50) అనే వ్యక్తి వృత్తిరీత్యా గాయత్రి కన్స్ట్రక్షన్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి విధులు ముగించుకుని సర్వీసు రోడ్డు వెంబడి ఇంటికి తిరిగి వస్తుండగా కొంగరకలాన్ సమీపంలోని ఔటర్రింగ్రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.