సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న
ఒలింపిక్ చాంపియన్ సుశీల్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మర్డర్ కేసులో అరెస్టైన సుశీల్ కుమార్ను రైల్వేలో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడానికి
నార్తర్న్ రైల్వే సిద్ధంగా ఉందని ఒక ప్రతినిధి సోమవారం తెలిపారు.
నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్గా ఉన్న ఒలింపిక్ పతక విజేత సుశీల్ను పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం ఛత్రసాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ(ఓఎస్డీ)గా ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.
‘హత్యకేసుకు సంబంధించిన ఒక రిపోర్టు ఢిల్లీ ప్రభుత్వం నుంచి రైల్వే బోర్డుకు వచ్చింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతన్ని సస్పెండ్ చేస్తామని’ నార్తర్న్ రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ పీటీఐకి వెల్లడించారు. రెండు రోజుల్లో రెజ్లర్ను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.