నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లా దవాఖానలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 టీకా సురక్షితమని, ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. దీని ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం టీకా వేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి, టీకా తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా అందరూ నిబంధనలు పా టించాలని సూ చించారు. ఈ కా ర్యక్రమంలో ఆర్ఎంవో వేణుగోపాల కృష్ణ, దవా ఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.