రంగారెడ్డి : గుర్తు తెలియని వ్యక్తిని ఆటో ట్రాలీ ఢీ కొట్టడంతో అక్కడికక్క మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వైపు కోడి గుడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాలీ ఆటో (టీఎస్ 08 యూబీ 9879) పెద్ద అంబర్ పేట్ అవుటర్ రింగ్ రోడ్ మొదటి బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం