హైదరాబాద్ : లాక్డౌన్ అమలును పర్యవేక్షించేందుకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదివారం సుచిత్రా, అల్వాల్ ఐజీ స్టాచ్యూ, గోల్నాక క్రాస్ రోడ్, ఆల్విన్ కాలనీ, ధూలపల్లి క్రాస్రోడ్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పోలీసు అధికారులతో కాసేపు మాట్లాడిన సీపీ రోడ్డలపై ఏర్పాటు చేసిన వివిధ చెక్పోస్ట్ల వద్ద ఉన్న పలువురు అధికారులను కలిసి పరిస్థితిని సమీక్షించారు. పౌరులతో మాట్లాడేటప్పుడు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. వాహనాల కదలికను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఇతర అధికారులతో కలిసి వాహన తనిఖీలో పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. ఏవైనా లక్షణాలుంటే నిర్లక్ష్యం వహించక, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. లాక్డౌన్ అమలులో సైబరాబాద్ పరిధిలో మొత్తం 5 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో సీపీ వెంట ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, సీఎఆర్ ప్రధాన కార్యాలయం ఏడీసీపీ మణికరాజ్, పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, పేట్బషీరాబాద్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.