మేడ్చల్ మల్కాజిగిరి : మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యం తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ గాంధీనగర్కు చెందిన రాజేశ్(42),జ్యోతిలు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరికి 17 ఏండ్ల కిందట వివాహం జరిగింది. రాజేశ్ గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యంపుల్గా సేవించి స్థానికంగా కొంతమందితో గొడవపడ్డాడు.రాజేశ్ అనంతరం తన రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ వేసుకొని పడుకున్నాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు రెండు గంటల తర్వాత తలుపులు ఎంత కొట్టినా తీయకపోవంతో అనుమానంతో తలుపులు బలవంతంగా తెరిచి చూడగా ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని దర్శనమచ్చాడు. హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. సాయంత్రం కూతురి పెళ్లి.. ఉదయం తండ్రి మృతి
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్