లండన్: మాజీ చాంపియన్ ఇటలీ ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. లండన్లోని వెంబ్లే స్టేడియంలో మరో మాజీ చాంపియన్ స్పెయిన్ను ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్కాచ్లో 4-2 తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయానికి 1-1 స్కోర్తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. దీంతో ఫలితంకోసం అదనపు సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ 60 నిమిషం వద్ద ఇటలీ ఆటగాడు ఫెడరికో చైసా కళ్లుచెదిరేలా గోల్ చేశాడు. మరో 20 నిమిషాల తర్వాత ఇరుజట్ల స్కోరు మళ్లీ సమం అయ్యింది.
ఆట 80 నిమిషం వద్ద స్పెయిన్ ఆటగాడు అల్వారో మొరాటా గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 2-2 స్కోర్ వద్ద నిలిచాయి. తర్వాత మ్యాచ్లో ఇటలీ పైచేయి సాధించింది. ఆట చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ షూటౌట్లో జోర్గిన్హో గోల్ చేసి ఇటలీకి విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో ఆదివారం ఇదే స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ లేదా డెన్మార్క్తో ఇటలీ తలపడనుంది.