అహ్మదాబాద్: పావురాన్ని కాపాడబోయిన ఒక వ్యక్తి కరెంట్ షాక్తో మరణించాడు. గుజరాత్లోని అరవాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాల్పూర్లో నివాసం ఉండే 45 ఏండ్ల దిలీప్ వాఘేలా కరెంట్ పోల్పై వైర్లకు చిక్కుకున్న ఒక పావురాన్ని చూశాడు. దానిని కాపాడేందుకు స్తంభం ఎక్కబోగా స్థానికులు వారించారు. మూడు సార్లు ప్రయత్నం విరమించుకున్న దిలీప్ నాలుగోసారి కరెంట్ పోల్ ఎక్కాడు. పైకి వెళ్లగా కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడి అతడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.