మొయినాబాద్ : విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన కనగళ్ల యాదయ్య(58) గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పని చేస్తున్నాడు. ముప్పై ఏళ్ల క్రితం అతని భార్య, కూతురు మరణించడంతో తమ్ముడు రవి వద్ద ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఫాంహౌస్కు వెళ్లాడు.
పశువుల కొట్టంలో వేలాడుతున్న కరెంట్ వైర్లు యాదయ్యకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ దవఖానకు తరలించారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.