వనపర్తి : బర్రెతో లైంగిక వాంఛ తీర్చుకోబోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగవరం కాలనీలోని బాల్రెడ్డికి చెందిన బర్రెల కొట్టంలోకి శుక్రవారం అర్ధరాత్రి స్థానికుడు ఆంజనేయులు (45) వచ్చాడు. బర్రెతో కోరిక తీర్చుకుంటుండగా తోక మెడకు బిగుసుకుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం కొట్టంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ షేక్ షఫీ తెలిపారు.