హైదరాబాద్ : పెంట్ హౌస్ను కూల్చే క్రమంలో అదుపుతప్పి పైనుంచి పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో ఇవాళ ఘటన జరిగింది. గోపాల్నగర్కు చెందిన రామస్వామి అనే వ్యక్తి తన ఇంటిపై పెంట్ హౌస్ను కూలుస్తుండగా పట్టుతప్పి పైనుంచి పడ్డటంతో తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.