జోగులాంబ గద్వాల : సమయానుకూల అవసరం ఓ మనిషిని ఎంతటి శ్రమకైనా ఓర్చుకునేలా చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామంలో వీరేష్ అనే రైతు పొలంలో సిడిపత్తి పెట్టాడు. తనకు సొంతంగా ఎద్దులు లేవు. ఎద్దులను బాడిగకు తీసుకుందామన్నా చాలా ఎక్కువ మొత్తంలో అడుగుతుండటంతో చేసేదేమి లేక పొలం దున్నేందుకు తన భార్యను, సొంత చెల్లిని కాడెద్దులుగా పెట్టుకున్నాడు.