జగిత్యాల : జిల్లాలోని కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువులో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. కాగా చేపలుపట్టే క్రమంలో వ్యక్తి జారి చెరువులో పడి గల్లంతయ్యాడు. బంధువులు ఆదివారం ఉదయం చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. మృతుడు సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలవాసి ద్యావల ప్రభాకర్(28). మృతునికి భార్య, కూతురు ఉన్నారు.