మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని మెయిన్ బజార్లో విషాదం నెలకొంది. ఓ 50 ఏండ్ల వ్యక్తి తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని చంద్ర సురేశ్ బాబుగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సురేశ్ బాబు బాధపడుతున్నారని, ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సురేశ్ బాబుకు భార్య హిమబిందు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.