బండ్లగూడ : బోయిన్ పల్లి సీతారాంపూర్ కు చెందిన నరేంద్రకుమార్ (57) అటో డ్రైవర్ కోవిడ్తో ఆర్దిక ఇబ్బందులు ఎదురై కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అదివారం హిమాయత్ సాగర్లో దూకి అత్మహత్యకు పాల్పడాడు. తన సొంత ఆటోలో ఆదివారం ఉదయం నరేంద్ర ఇంటి నుంచి బయటకు వచ్చారు.సోమవారం స్థానికులు అటోను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టు పక్కల పరిశీలించగా చెరువులో మృతదేహం కనిపించింది. అటోలో ఉన్న డైరీలోని పోన్ నెంబర్లకు ఫోన్ చేయగా మృతుని భార్య పోన్ ఎత్తడంతో అమెను పిలిపించి మృత దేహన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.