జోగులాంబ గద్వాల : చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని ఐజ మండలం యాపదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సైమన్ (40) వృత్తిరీత్యా ఐస్క్రీం బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దవాఖానాల్లో చూపించిన ఆరోగ్యం నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం బహిర్భూమికి వెళ్లిన చోట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : హార్వెస్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..