కొడంగల్ : కుటంబ గొడవలో క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిట్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్లపల్లి గ్రామానికి చెందిన అబ్దులప్ప(48) మంగళవారం రాత్రి మధ్యం సేవించి ఇంట్లో గొడవ పడ్డాడని, బుధవారం ఉదయం మధ్యం దుకాణానికి వెళ్లి మళ్లీ మధ్యం సేవించినట్లు పేర్కొన్నారు. ఆ తరువాత పత్తి చేనుకు పురుగుల మందు కొట్టేందుకు బయలుదేరే క్రమంలో ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగినట్లు తెలిపారు.
పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.