హైదరాబాద్ : నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్గా పేర్కొంటూ క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలానికి చెందిన జి.రాజేంద్ర ప్రసాద్ అలియాస్ ప్రసాద్ అలియాస్ కృష్ణారెడ్డిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాద్కు తాగుడు, పేకాట అలవాటు ఉంది. నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్గా పేర్కొంటూ ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నట్లు తెలిపేవాడన్నారు.
నీటిపారుదలశాఖలో క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుండి డబ్బలు వసూలు చేసినట్లు తెలిపారు. నలుగురు ఆశావాదాల నుండి ప్రసాద్ లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఇటు ఉద్యోగం ఇప్పించక అటు డబ్బులు తిరిగియకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పరకాల, బేగంపేట, ఉప్పల్, వనపర్తికి చెందిన యువకులు ప్రసాద్ను నమ్మి మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.