హైదరాబాద్ : పెండ్లి పేరుతో యువతిని ఓ వ్యక్తి మోసగించాడు. యువతిని నమ్మించి రూ.6 లక్షలు కాజేశాడు. పెండ్లి సంబంధాల విషయమై యువతి క్రిస్టియన్ మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి చేసుకుందామని యువతిని సంప్రదించాడు. ఇంగ్లండ్లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. ఇంగ్లండ్ నుంచి ఖరీదైన కానుకలు పంపుతున్నానని యువతికి సమాచారం ఇచ్చాడు. ఇతడే కొన్ని రోజుల తర్వాత కస్టమ్స్ అధికారినంటూ యువతికి ఫోన్ చేశాడు. పన్నుల పేరిట యువతి నుంచి రూ.6 లక్షలు కాజేశాడు. చివరికి మోసపోయానని గమనించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.