హైదరాబాద్ : రెడ్ లేబుల్ టీ పౌడర్ బ్రాండ్తో కల్తీ టీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 10 బ్యాగుల టీ పౌడర్, రెండు మొబైల్ ఫోన్లు మొత్తం రూ.1.4 లక్షల విలువైన సామానును స్వాధీనం చేసుకున్నారు. కల్తీపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది నగరంలోని గౌలిగూడలో రైడ్ చేసి రాజస్థాన్ నివాసి మహేందర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్కే చెందిన సురేందర్ అనే వ్యక్తి నుండి మహేందర్ టీ పౌడర్ను కొనుగోలు చేస్తూ లోకల్ నెట్వర్క్ ద్వారా మార్కెట్కు సరఫరా చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి నకిలీ టీ పౌడర్ను తెప్పించి స్థానికంగా అమ్ముతూ భారీ లాభాలను ఆర్జిస్తున్నట్లు డీసీపీ టాస్క్ఫోర్స్ గుమ్మి చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేందర్ ఆచూకీకి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం మహేందర్ను, స్వాధీనం చేసుకున్న వస్తువులను అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.