న్యాల్కల్/సంగారెడ్డి : పాత కక్షలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం మండల కేంద్రమైన న్యాల్కల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సంవత్సరం గ్రామంలోని బుడగ జంగాల కాలనీ చెందిన ఓ వ్యక్తిని పాత కక్షలతో దాడి చేసి హత మార్చారు. అప్పట్లో కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన నిందితులను జైలుకు పంపారు. కాగా, గత కొద్ది రోజుల క్రితం జైలు నుంచి నిందితులు బయటకు వచ్చి పటాన్ చెరువు ప్రాంతంలో నివాసముంటున్నారు.
మంగళవారం స్వగ్రామమైన తన సొంతింటికి నిందితుడు తూర్పాటి శంకర్ వస్తుండగా.. గత సంవత్సరం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు దారి కాచి కత్తితో దాడి చేయడంతో తూర్పాటి శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జహీరాబాద్ రూరల్ సీఐ నాగేశ్వరరావు, హద్నూర్ ఎస్సై వినయ్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.
హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత