తాండూరు రూరల్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54) ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని ఓ పొలంలో టీ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేసే ఇద్దరు వ్యక్తులు కలసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడు టీ దుకాణంతో పాటు మద్యం (బెల్టు) దుకాణం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మృతుడు రామప్ప, ఇద్దరు కార్మికుల మధ్య విషయంపై గొడవ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మద్యం మత్తులో కార్మికులు కలిసి రామప్ప గొంతులో స్కూడ్రైవర్తో పొడిచి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు. సంఘటన స్థలాన్ని తాండూరు డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ జలంధర్రెడ్డిలు సందర్శించారు.