వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భూవివాదం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొడంగల్ మండలం హుస్నాబాద్ గ్రామంలో ఇవాళ ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలంగా పలువురితో భూవివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో దాయాదులు అతడిని మధ్యాహ్నం గొడ్డలితో నరికి పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు పోలీసు రంగంలోకి దిగారు.