హైదరాబాద్ : నగరంలో ఆసిఫ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉండే ఎజాజ్ అనే వ్యక్తి ఇంట్లోకి ఈ మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతడిని కత్తులతో పొడిచి హతమర్చారు. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. స్థానికంగా ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.