అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తోడబుట్టిన అన్ననే కత్తితో నరికి తమ్ముడు పాశవికంగా హతమార్చాడు. అత్తిలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అత్తిలికి చెందిన అన్నదమ్ముల నడుమ కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అన్నను తమ్ముడు కత్తితో నరికి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అత్తిలి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.