బర్మింగ్హామ్: భారత్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లండ్పై నాలుగు రోజుల్లోనే అలవోకగా గెలిచి.. 1-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లిష్ గడ్డపై 21 ఏండ్ల తర్వాత కివీస్ సిరీస్ దక్కించుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆదివారం న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 122/9తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి బంతికే ఓలీ స్టోన్ (15) వికెట్ కోల్పోయి ఆలౌటైంది. ఆ తర్వాత కివీస్ చూస్తుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో కివీస్ 388 పరుగులు చేయగా ఇంగ్లండ్ జట్టు 303 రన్స్కే పరిమితమైంది. అనంతరం న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ మళ్లీ పోటీలోకి రాలేకపోయింది. తొలి టెస్టులోనూ న్యూజిలాండ్ పటిష్టమైన స్థితిలో ఉండగా.. రూట్సేన వర్షం వల్ల గట్టెక్కింది.