పబ్లిక్ ప్లేస్లో మూత్ర విసర్జన చేశాడని కొట్టిచంపారు!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రెయిక్ జిల్లాలో దారుణం జరిగింది. తమ ఇండ్ల ఆవరణలో మూత్ర విసర్జణ చేశాడని కొందరు వ్యక్తులు సుహెయిల్ అనే యువకుడిని కొట్టి చంపారు. జిల్లాలోని ఖైరి డుకోలి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి సుహెయిల్ అనే యువకుడు ఖైరి డుకోలి గ్రామం మీదుగా వెళ్తూ ఒకచోట మూత్రవిసర్జన చేశాడు. ఇది గమనించిన రామ్ మూరత్ అనే మరో యువకుడు తమ ఇండ్ల ముందు ఎందుకు మూత్ర విసర్జన చేశావంటూ నిలదీశాడు.
దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ మరింత పెద్దది కావడంతో ఇరుగపొరుగు అక్కడికి చేరుకున్నారు. రామ్మూరత్తోపాటు ఆత్మారామ్, రాంపాల్, సనేహి, మంజీత్ అనే యువకులు కలిసి సుహెయిల్ను తీవ్రంగా కొట్టారు. కర్రలతో కొట్టడంతో అతను ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి చింతారామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆదిపురుష్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
- ఆయన సేవ.. మరొకరికి తోవ..
- లీజుకు పది హరిత హోటళ్లు
- భార్యను చంపిన కేసులో ఏడేండ్ల జైలు
- బైకులు ఢీకొని ఒగ్గు కళాకారులు దుర్మరణం
- రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ