జనగామ : బావపై బావమరిది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామలో బుధవారం చోటుచేసుకుంది. అక్కను చంపాడనే అనుమానంతో బావ చంద్రశేఖర్ను బావమరిది రమేశ్ కత్తితో పొడిచాడు. ఈ దాడిలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడు చంద్రశేఖర్ నర్మెట్ట మండలం ఇప్పలగడ్డ తండా వాసి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.