లక్నో: ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా కొట్టాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీస్పైనా అతడు దాడి చేశాడు. ఈ సందర్భంగా పోలీస్ యూనిఫాంను చించివేశాడు. దీంతో విధులను అడ్డుకున్నందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ జిల్లాలోని భోజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజ్నా గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ అనే వ్యక్తి తన భార్యను చావకొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రాజేంద్ర సింగ్ అక్కడకు వెళ్లారు. కొడుతున్న భర్త నుంచి అతడి భార్యను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఇది తమ వ్యక్తిగత విషయమంటూ పోలీస్పై రంజిత్ దాడి చేశాడు. అంతేగాక పోలీస్ చొక్కాను చించివేశాడు.
ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ రంజిత్ సింగ్ పిలుపుతో పోలీస్ టీం అక్కడకు వచ్చింది. నిందితుడు రంజిత్ సింగ్ను అరెస్ట్ చేశారు. పోలీస్పై దాడి, విధులకు ఆటంకం కల్పించం, అడ్డుకోవడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.