వరంగల్ అర్బన్ : వరంగల్ ట్రై సిటీ పరిధిలో ఆక్సిజన్ ఫ్లోమీటర్లను అధిక ధరలకు అమ్మితూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 12 ఫ్లోమీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జీ వివరాలను వెల్లడించారు.
వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖుద్దుస్ ఆక్సిజన్ ఫ్లోమీటర్లను ఇతర
ప్రాంతాల నుంచి రూ.1300 కొనుగోలు చేసి నగరంలో అధిక ధరలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు.
ఇందులో భాగంగా నిందితుడు ఒక్క ఫ్లోమీటర్ పదివేల రూపాయలకు బ్లాక్లో తన ఇంటిలో కరోనా వ్యాధిగ్రస్తుడి బంధువులకు అమ్ముతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
నిందితుడి ఇంటిపై పోలీసులు దాడి చేసి 12 ఫ్లో మీటర్లను స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్