మెహిదీపట్నం : బైక్ పై వెళుతున్న స్నేహితులైన యువతి,యువకుడిని అడ్డుకుని దాడికి పాల్పడ్డ వ్యక్తిని గోల్కొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 24న టోలిచౌకి రోడ్లో బైక్పై వెళుతున్న యువతి,యువకుడిని ఓ వ్యక్తి అడ్డగించి దాడికి పాల్పడ్డాడు.
దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి దాడికి పాల్పడ్డ వ్యక్తిని మంగళవారం పట్టుకున్నారు. కొడంగల్కు చెందిన మహ్మద్ రఫీ (32) ఎండీలైన్స్లో ఉంటున్నాడు. ఇతడు ఈ నెల 24 న ఓ వర్గానికి చెందిన వ్యక్తి తమ వర్గానికి చెందిన యువతిని బైక్ పై తీసుకువెళుతుండటాన్ని గమనించి అడ్డగించి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.
దీంతో సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి దాడికి పాల్పడ్డ మహ్మద్ రఫీని మంగళవారం టోలిచౌకి ప్రాంతంలో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.