వరకట్నం కేసులో తల్లి, కొడుకుకు జైలు

హైదరాబాద్ : వరకట్నం కేసులో భర్తకు, అతని తల్లికి న్యాయస్థానం ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష అదేవిధంగా చెరో రూ.6 వేలు జరిమానాగా విధించింది. బాధితురాలు ఎస్. లీలావతి, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ జిల్లా నివాసి. 2015 అక్టోబర్లో నగరంలోని మల్కాజ్గిరిలో నివసిస్తున్న ఎస్. శశికిరణ్ రెడ్డి (35) ను వివాహం చేసుకుంది. వివాహం సమయంలో లీలావతి తల్లిదండ్రులు నగదు, బంగారం, వ్యవసాయ భూమి, ఇతర వస్తువులను వరకట్నంగా ఇచ్చారు. వివాహం తరువాత ఈ జంట ఒక నెల మాత్రమే సంతోషంగా ఉంది. వెనువెంటనే అదనపు కట్నం కోసం లీలావతికి వేధింపులు ప్రారంభమయ్యాయి. 2016 ఫిబ్రవరి నుంచి ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి.
లీలావతికి కనీసం ఆహారం కూడా పెట్టకుండా వేధించేవారు. ఈ వేధింపులను భరించలేని ఆమె జూన్ 2016లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని శశికిరణ్ను ఇతని తల్లి ఉషాను అరెస్టు చేశారు. కేసులో దోషులకు శిక్షపడేలా చేసిన దర్యాప్తు అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్డు సిబ్బంది అధికారులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.
తాజావార్తలు
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ