హైదరాబాద్ : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,961 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,67,517కు పెరిగాయి. 5,26,043 మంది కోలుకున్నారు. ఇంకా 38,267 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మొత్తం 90,226 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.