ఇక నుంచి పెళ్లికార్డుపై వధూవరుల బర్త్ డేట్ కూడా ఉండాలి. ఇది తప్పనిసరి. లేదంటే శిక్ష తప్పదు. ఎక్కడ ఈ నిబంధన అంటే రాజస్తాన్ లో. ఎందుకంటే అక్కడ బాల్యవివాహాలు ఎక్కువ కాబట్టి. ఎన్ని అవగాహాన కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపినా సరే రాజస్తాన్ లో బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇక నుంచి పెళ్లి కార్డులపై తప్పనిసరిగా వధూవరుల పుట్టినతేదీని ముద్రించాల్సిందే స్పష్టం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ కి బర్త్ సర్టిఫికేట్ల కాపీని అందజేయాలని చెప్పింది. ఈమేరకు జిల్లా, పంచాయతీ, కలెక్టర్, ఎస్పీ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వీటిని బేఖాతరు చేస్తే ఆ పెళ్లి చేసిన తల్లిదండ్రులు, అతిథులపైనే కాదు క్యాటరింగ్, పురోహితుడు, టెంట్, బ్యాండ్ మేళం అందరిపైనా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.