ముంబై: భార్య అనారోగ్యం, వైద్య ఖర్చులను భరించలేని భర్త ఆమెను హత్య చేశాడు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఈ దారుణం జరిగింది. ముద్గల్ గ్రామానికి చెందిన 45 ఏండ్ల వ్యక్తి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు భార్య బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నది. దీంతో భార్య అనారోగ్యంపై అతడు విసుగుచెందాడు. వైద్యం చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమెను చంపాలనుకున్నాడు.
శనివారం రాత్రి పదునైన కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. రక్తం అంటిన దుస్తులను ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్తం మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అతడ్ని అరెస్ట్ చేశాడు. హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.