దవాఖాన నుంచి శిశువును అపహరించిన మహిళ

భోపాల్: దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువును ఒక మహిళ అపహరించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. మహారాజా యశ్వంతరావు దవాఖానలో ఆదివారం ఒక మహిళ శిశువునకు జన్మనిచ్చింది. ఇంతలో ఒక యువతి వారి వద్దకు వచ్చింది. శిశువు గుండె కొట్టుకోవడంలో తేడా ఉన్నదని, పరీక్ష కోసం తీసుకెళ్లాలని చెప్పింది. ఆ శిశివును తన చేతుల్లోకి తీసుకుని ఆ మహిళ వెళ్తుండగా బిడ్డ అమ్మమ్మ ఆమెను అనుసరించింది. అయితే శిశువును డాక్టర్కు చూపించి తీసుకువస్తానని చెప్పి ఆ యువతి మాయమైంది. ఆమె ఎంతకి తిరిగిరాకపోడంతో బిడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దవాఖానలోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. శిశువును చేతపట్టుకుని వెళ్తున్న యువతిని బిడ్డ అమ్మమ్మ అనుసరించడం, అనంతరం ఆమె మాయం కావడం అందులో కనిపించాయి. దీంతో సీసీటీవీ దృశ్యాలను మరింతగా పరిశీలించి పసి బిడ్డను అపహరించిన నిందితురాలిని పట్టుకుంటామని ఇండోర్ ఎస్పీ విజయ్ విజయ్ ఖాత్రి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి#WATCH Madhya Pradesh: A newborn child was allegedly stolen by a woman from Maharaja Yeshwantrao Hospital in Indore on 15th November. An FIR has been registered. (Source: CCTV footage) pic.twitter.com/3sjJ6ueQQq
— ANI (@ANI) November 16, 2020
తాజావార్తలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!