మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి నీటిప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9500 క్యూసెక్యుల నీరు వస్తున్నది. అయితే 16,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. జలాశయంలో ప్రస్తుతం 316.450 మీటర్లు వద్ద నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.867 టీఎంసీలు నిల్వ ఉన్నది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి (శ్రీశైలం వైపు) 13,142 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కాగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 19,987 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 816.80 అడుగుల మేర నీరుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 38.5730 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తితో 12,713 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.