హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక లెమన్ ట్రీ హోటల్లో ఓ ప్రేమజంట మృతిచెందింది. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు బ్లేడుతో యువతి గోంతు కోసం చంపాడు. అనంతరం తాను హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను మహబూబ్నగర్కు చెందిన సంతోషి, రాములుగా గుర్తించారు. రాములు నిన్న మధ్యాహ్నం హోటల్లో గది తీసుకున్నాడు.