హిట్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు సాయి కుమార్ తనయుడు ఆది. మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆది తాజాగా కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందనున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ని కొత్త డైమెన్షన్లో చూపించనున్నారట. పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి.. సునీల్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించి ఆయనని సంప్రదించారట. వెంటనే ఆయన ఓకే అన్నందుకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను అని నిర్మాత నాగం తిరుపతి రెడ్డి అన్నారు. ఎన్నో చిత్రాలకు సక్సెస్ఫుల్ మ్యూజిక్ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.