ములుగు : జిల్లాలోని మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామంలో కాడ బోయిన వీరయ్య అనే రైతు పిడుగపాటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..బుధవారం తన పంట పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో వర్షం కురవడంతో తడవకుండా ఉండేందుకు చెట్టు కిందికి వెళ్లగా.. పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వీరయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.